దామర, జులై 4 : మొక్కలను విరివిగా నాటాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా దామెర మండలం ఓగులాపూర్ గ్రామంలోని సైలని బాబా దర్గాలో దర్గా పీఠాధిపతి హజ్రత్ పీర్ హాజి మహ్మద్ అబ్దుల్ హమీద్ షా మియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలోఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అంతకుముందు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు.
భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలన్నారు. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు విరివిరిగా మొక్కలను పెంచాలన్నారు. కార్యక్రమంలో దర్గా సేవకులు ఎస్.కె మోయిన్, కొమ్మాల ఎంపీడీవో కల్పన, ఎస్ఐ అశోక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన్నెం ప్రకాష్ రెడ్డి, సదరం పోశాలు, దురుశెట్టి బిక్షపతి, గుడిపాటి శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బింగి రాజేందర్, గోంగూర రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.