నల్లబెల్లి, మార్చి 24: గులాబీ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పార్టీ బలోపేతమే లక్ష్యంగా నియోజకవర్గంలో మొదటి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని రాంపూర్, మేడపెల్లి జంట గ్రామాల్లో శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అందరి ఆలోచనల ఉమ్మడి వేదిక బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనమని అన్నారు. సీఎం కేసీఆర్ కృషి, జిల్లా మంత్రి సహకారంతో రూ. 35 కోట్ల నిధులతో నల్లబెల్లి మండల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.
ఈ నిధులతో చేపట్టిన ప్రతి పనిని గ్రామాల్లో ప్రజలకు ఒకటికి రెండు సార్లు విడమర్చి చెప్పాల్సిన అవసరం ప్రతి కార్య కర్తపై ఉందన్నారు. ఇందుకోసం నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో మొత్తం 24 ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథ కం నియోజకవర్గంలో నిష్పక్షపాతంగా అమలు చేస్తూ ప్రతిపక్ష పార్టీలకు సైతం విమర్శించే అవకా శం లేకుండా అభివృద్ధి చేస్తున్నామని తెలుపడాని కి గర్వపడుతున్నానన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చా రు. ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా అంచనాలకు మించి అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు అర్థ మయ్యేరీతిలో తెల్పడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
మొదటిసారి ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతో గెలిచానని, ఈ నాలుగేళ్ల కాలంలో ఇచ్చిన మాటకు కట్టుబడి గోదావరి జలాలను తీసుకొచ్చి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సైతం గ్రామ, మండల కమిటీల సమ న్వయంతో ముందుకు నడిచి గ్రామాల్లో మిగిలి ఉన్న పనులను గుర్తించి అభివృద్ధికి కృషి చేస్తామ న్నారు. రాదేది బీఆర్ఎస్కు సాటి అనేలా పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూ చించారు. సమావేశంలో ఎంపీపీ ఊడుగుల సునీ త, మాజీ ఎంపీపీ బానోత్ సారంగపాణి, పార్టీ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్గౌడ్, పీఏసీ ఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్రావు, వైస్ ఎంపీపీ గందె శ్రీలత, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీని వాస్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ గోనెల పద్మ, నాయకులు హింగె శివాజీ, గందె శ్రీనివాస్ గుప్తా, కొత్తపెల్లి కోటిలింగాచారి, ప్రజాప్రతినిధు లు, క్లస్టర్ ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.