జనగామ, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : బండారి దేవుడిని కురుమలు భక్తితో వేడుకున్నారు. పిల్లా పాపలతో కలిసి వచ్చి చల్లంగ చూడు స్వామి అని మొక్కులు చెల్లించారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురసరించుకొని కురుమల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప కామరతి, అక మహంకాళి దేవుళ్లకు భక్తిశ్రద్ధలతో కురుమలు కొలిచారు. కురుమ సంఘం పట్టణ అధ్యక్షుడు బాల్దే మల్లేశం పట్టు వస్త్రాలు సమర్పించగా గౌరవాధ్యక్షుడు మోటే దేవేందర్ మొదటి బోనం సమర్పించారు. అనంతరం పట్టణంలోని అన్ని ప్రాంతాల కురుమలు ఒగ్గు కళాకారుల నృత్యాలతో, డోలు వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా బోనాలతో బొడ్రాయి నుంచి నెహ్రూ పార్ మీదుగా బీరప్ప దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి మొకులు చెల్లించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సేవెల్లి సంపత్, జిల్లా అధ్యక్షుడు కంచ రాములు, పట్టణ ప్రధాన కార్యదర్శి జూకంటి శ్రీశైలం, కోశాధికారి కేమిడి ఉపేందర్, గౌరవాధ్యక్షుడు బాల్దె సోమయ్య, అధ్యక్షుడు కర్రె కృష్ణ, కార్యదర్శి మంత్రి శ్రీశైలం, కోశాధికారి యెండ్రు వైకుంఠం, పెద్ద కురుమలు మోటె లింగయ్య, మోటె శ్రీను, కౌన్సిలర్లు పెర్నె స్వరూపా ఆంజనేయులు, కర్రె శ్రీనివాస్, జుకంటి లక్ష్మీ శ్రీశైలం, బాల్దే కమలమ్మ, మంత్రి సుమలత శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శి జాయ మల్లేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఆలేటి సిద్దిరాములు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బొరెల్లి సిద్ధులు, బాల్దే ఆంజనేయులు, మోటె దేవేందర్, పిక బీరప్ప, దయ్యలా శ్రీను, దేవర ఉపేందర్, బాల్దే సత్తయ్య, జుకంటి మధు, కడకంచి మధుసూదన్, కడకంచి మల్లేశం, జెట్ట యాదగిరి, మంగ సిద్ధులు, మంగ శ్రీశైలం, బాల్దే యోగేశ్, కురుమ సంఘం రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు ఆలేటి రాజు, జిల్లా వరింగ్ ప్రెసిడెంట్ చిన్నం నర్సింహులు, జిల్లా నాయకులు నోముల మహేశ్, సానిక శ్రీను, బేజాడి హరీశ్, మంగ శ్రీశైలం, సేవెల్లి మధు, జూకంటి మధు, కర్రె రాములు తదితరులు పాల్గొన్నారు.