కాశీబుగ్గ, నవంబర్ 2: మరోసారి ఆశీర్వదించండి.. అన్ని విధాలా అండగా ఉంటానని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గ్రేటర్ వరంగల్ లక్ష్మీపురంలోని మోడల్ కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి వ్యాపారిని కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునుపెన్నడూ చూడని విధంగా వరంగల్ తూర్పు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ వ్యాపార, వాణిజ్య వర్గాలకు అనుకూలంగా ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. తూర్పు ప్రజలతోపాటు జిల్లా ప్రజానీకం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ ప్రగతి అందరి కళ్లెదుటే కనబడుతున్నదన్నారు. తనకు మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తానన్నారు. అతి త్వరలోనే ఈ మార్కెట్ పనులు పూర్తి కానున్నట్లు చెప్పారు. వ్యాపారులు, ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉండేలా రూపుదిద్దుకుంటున్న ఈ మార్కెట్ చరిత్రలో నిలిపోతుందన్నారు. ఈ సందర్భంగా మార్కెట్లో పలువురు వ్యాపారులు ఎమ్మెల్యే నరేందర్కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అనిల్, కూరగాయల, పండ్ల మార్కెట్ వ్యాపారుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
కరీమాబాద్: రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్దే అధికారమని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఫోర్టురోడ్డులోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఇతర పార్టీల నుంచి నాయకులు నన్నపునేని ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రతిపక్షాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఫిదా అవుతున్నారని చెప్పారు. ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో తమ పార్టీకి ఎదురులేదన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నారని కొనియాడారు. పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి అండగా ఉంటామన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. బీఆర్ఎస్ గెలుపు కోసం నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పథకాలను ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 21వ డివిజన్ మోమిన్పురకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. మహ్మద్ తైసిన్, షరీఫ్, మహ్మద్ గౌస్ ఆధ్వర్యంలో సయ్యద్ రబ్బాని, మహ్మద్ జునైద, మహ్మద్ ఫిరోజ్, సోహెల్, అబీద్, ఆసీఫ్, సమీద్ వహద్, ఇక్బాల్, ఆజంబాబా, తైసిన్, గౌస్, హాజీతోపాటు మరో 50 మంది కార్యకర్తలు కార్పొరేటర్ ఎండీ ఫుర్ఖాన్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కార్పొరేటర్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దుబ్బ శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు జూపాక అనిల్, ఆజం, మాజీ కార్పొరేటర్ యాకుబ్పాషా, ఎండీ ఆదిల్, ప్రదీప్ పాల్గొన్నారు.
కాశీబుగ్గ: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు షేక్ ఫకృద్దీన్, ఉల్ఫత్ ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. గురువారం ఉదయం కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. పోచమ్మమైదాన్కు చెందిన సయ్యద్ అబ్దుల్ గని, ఎస్కే యాసిన్, కేఎల్ మహీంద్రానగర్కు చెందిన ఎస్కె ఉస్మాన్ సీఎం కేసీఆర్ సారథ్యంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధికి ఆకర్షితులై గులాబీ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
ర్మాజీపేట: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే నరేందర్కే తమ పూర్తి మద్దతు ఉంటుందని రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షుడు, తెలంగాణ మత్స్య సహకార సంఘం సమాఖ్య వైస్ చైర్మన్ దీటి శ్రీధర్ సమక్షంలో జిల్లా గంగపుత్ర సంఘం సభ్యులు స్పష్టం చేశారు. గురువారం రాత్రి శివనగర్లో ఎమ్మెల్యేను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో నన్నపునేనిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు భాగస్వాములం అవుతామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గంగపుత్ర సంఘం నాయకులు డోలి రాజలింగం, బీఆర్ఎస్ నాయకులు ముష్కమల్ల సుధాకర్, పాక సురేందర్, రాజేంద్రకుమార్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మైసయ్య, సారంగపాణి, రాజేశ్, కన్ని పాల్గొన్నారు.