పోచమ్మమైదాన్,మే 29: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశా మని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. పోచమ్మమైదాన్లో సోమవారం రాత్రి 24, 25, 28 డివిజన్లకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు అరూరి రమేశ్ పాల్గొన్న సమా వేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ తూర్పు ఎంతో అభివృద్ధిలో ముందడుగు వేస్తోందని, పేదల మధ్య కలెక్టరేట్ నిర్మాణంతో భూమి విలు వ పెరిగిందని, దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరు గుపడుతాయన్నారు. చుట్టూ వ్యాపారాలు చేసు కునే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. జిల్లాలో పరిశ్రమలు రాబోతున్నాయని, దీనివల్ల యువత కు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పెట్టుబ డి పెట్టడానికి ఎవరైనా వస్తే వారి వసతి కోసం ఇదే చోట మంచి హోటల్ నిర్మిస్తామని చెప్పారు. ఉర్సుగుట్టను కల్చరల్ ఆడిటోరియంగా ఏర్పాటు చేస్తామని, దీనిని త్వరలో కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. అర్హులైన నిరుపేద లందరికీ లబ్ధి పొందేలా చూస్తానని హామీ ఇచ్చా రు. మైనారిటీల కోసం రెండు గురుకుల పాఠశా లలు ఏర్పాటు చేశామని, మెరుగైన విద్యుత్ సరఫ రా కోసం పోచమ్మమైదాన్లో ప్రత్యేకంగా సబ్ స్టేషన్ ఏర్పాటు చేశామని వివరించారు.
విజయవంతంగా ఆత్మీయ సమ్మేళనాలు : బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అరూరి రమేశ్
సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టిన ఆత్మీయ సమ్మేళనాలు విజయవంతంగా నడుస్తున్నాయి. ప్రజలు, కార్యకర్తలు ఒకచోట చేరి మంచి, చెడు లు మాట్లాడుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించడం తథ్యం. కేసీఆర్ నా యకత్వాన అందుతున్న ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్, రైతుబంధు, దళితబంధు, కులవృత్తులకు ప్రోత్సాహకాలను ప్రజలకు వివరించాలి. మన ప్ర భుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్న వారికి బుద్ధి చెప్పాలి. దేశంలోనే నంబర్ వన్గా మారిన తెలంగాణ గురించి ప్రజల్లో ప్రచారం చేయాలి. తూర్పును అభివృద్ధి పథంలో నిలుపుతున్న ఎమ్మె ల్యే నరేందర్ను మరోసారి గెలిపించుకోవాలి.
మన నీళ్లు, నిధులను ఆంధ్రా వాళ్లు దోచుకున్నారు : వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్
మనకు చెందాల్సిన నీళ్లు, నిధులు, నియామ కాలను ఆంధ్రావాళ్లు దోచుకుంటే సీఎం కేసీఆర్ నాయకత్వాన పోరాడి తెలంగాణను సాధించు కున్నాం. ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు, కాళే శ్వరంతో రైతులకు సాగునీరు అందుతోంది. 24 గంటల కరెంటు ఇస్తున్న సీఎంను ఇతర రా ష్ర్టాలు మెచ్చుకుంటున్నారు. దళితులకు దళితబం ధుతో సహకారం అందిస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన నరేందర్ కార్పొరేటర్గా, మేయ ర్గా, ఎమ్మెల్యేగా ఎదిగిండు. మళ్లీ ఈ ప్రాంత బిడ్డ గా నరేందర్ను అధిక మెజారిటితో గెలిపించుకోవాలి.
వందస్థానాల్లో గెలిచి.. సీఎం కేసీఆర్కు అందించాలి : ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వంద స్థా నాల్లో గెలుపొంది, సీఎం కేసీఆర్ దేశ రాజకీ యాల్లో వెళ్లడానికి మరింత ఉత్సాహం నింపాలి. అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు, అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకా లను ప్రజలకు వివరిస్తూ, వారిని చైతన్యం చేయా లి. ఆత్మీయ సమ్మేళనంలో 60లక్షల మంది కు టుంబసభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. దేశ చరిత్రలో ఇదొక మలుపు తిరుగుతుంది. కాగా సమావేశంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, నాయ కులు పాల్గొన్నారు.