వరంగల్ : ఖిలా వరంగల్ 37 వ డివిజన్ లోని ఎస్సీ కాలనీలో రూ.75 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండా నిలుస్తుండన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, మున్సిపల్ అధికారులు, టిఆర్ఎస్ నేతలు ఉన్నారు.