హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 5 :వచ్చే వర్షాకాలంలోపు నయీంనగర్ బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ నయీంనగర్ బ్రిడ్జి కూల్చివేత పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కమీషన్ల కోసం తాను కక్కుర్తి పడనని, వర్షాకాలం రాకముందే పనులు పూర్తి చేసేలా సహకరించాలని అధికారులకు సూచించారు.
నయీంనగర్ వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరుతోందన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అజీజ్ఖాన్, మాజీ డిప్యూటీ మేయర్ టీ అశోక్రావు, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, చాడ స్వాతీరెడ్డి, వేముల శ్రీనివాస్, మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్లు తాడిశెట్టి విద్యాసాగర్, వీరగంటి రవీందర్, సీనియర్ నాయకులు బిన్ని లక్ష్మణ్, నాయిని లక్ష్మీరెడ్డి, బొమ్మతి విక్రమ్, తోట పవన్ పాల్గొన్నారు.