న్యూశాయంపేట, ఫిబ్రవరి 3: ఏకశిల పారులో వాకింగ్ ట్రాక్ తో పాటు పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వరంగల్ పశ్చి మ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హామీ ఇచ్చారు. ఏకశిల పా రు వాకర్స్ అసోసియేషన్ వినతి మేరకు ఎమ్మెల్యే పారును శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పారు అభివృద్ధికి నిధులు కేటాయిస్తానన్నారు. సమావేశంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగా రాజిరెడ్డి, గౌరవాధ్యక్షుడు చాడ దశరథ రాంరెడ్డి, వాకర్స్ ఇంటర్నేషనల్ 303 వరంగల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పచ్చిమట్ల ఎల్లాగౌడ్, ప్రధాన కార్యదర్శి పడాల సోమయ్య, ఉపాధ్యక్షుడు బొద్దిరెడ్డి రాజిరెడ్డి, అసోసియేషన్ బాధ్యులు రవీందర్రావు, వీరస్వామి, రవీందర్ యాదవ్, అరుణారెడ్డి, సుమతి, అరుణ, రమణారెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు.