వరంగల్ : జిల్లాలోని గీసుగొండ మండలం కొమ్మాల గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదివారం దర్శించుకున్నారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ..జిల్లాలోనే ప్రఖ్యాతి గాంచిన జాతర కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర అన్నారు. హోలీ సందర్భంగా జరిగే జాతర ప్రతి కుటుంబంలో కష్టాలు తొలిగి, సంతోషాలు చేకూరాలని ఆ భగవంతుడిని కొరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెంట వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, గీసుగొండ జడ్పీటీసీ పోలీస్ ధర్మారావు , కుడా డైరెక్టర్ వీరగొని రాజ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.