హసన్పర్తి, ఏప్రిల్ 6 : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు,చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మండిపడ్డారు. గ్రేటర్ 1, 2, డివిజన్ల బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం గుండ్లసింగారంలో గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్తలే బీఆర్ఎస్కు పట్టుగొమ్మలని, వారిని అన్ని విధాలుగా పార్టీ ఆదుకుంటుందని చెప్పారు. బీజేపీ కుట్రలను బీఆర్ఎస్ నాయకులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
గడపగడపకూ సంక్షేమ పథకాలు : అరూరి
ప్రతి గడపకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. గత పాలకులు 70 ఏండ్లలో చేయని అభివృద్ధి, సీఎం కేసీఆర్ 9 ఏండ్లలో చేసి చూపించారని చెప్పారు. వర్ధన్నపేట నియోజక వర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ప్రతిఒక్కరూ పార్టీ కోసం పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం ప్రకాశ్ మాట్లాడుతూ గత పాలకులు చేసిన అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు మన పల్లెలు ఎలా ఉన్నాయో మన కళ్ల ముందే కని పిస్తున్నాయన్నారు. ఎండా కాలంలో కాల్వల్లో నిండుగా నీళ్లు ఎప్పుడన్న ఉన్నాయా అని ప్రజలు ఆలోచించాలని కోరారు. మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణను సీఎం కేసీఆర్ సస్యశ్యామలం చేశారని చెప్పారు.
మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిన అపర భగీరథుడు అని కొనియాడా రు. అనంతరం వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులో చేరారు. వారికి ఎమ్మెల్యే, చీఫ్ విప్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆత్మీయ సమ్మేళనంలో కళాకారులు పాటలతో ఉర్రూతలూగించారు. కార్యక్రమంలో సోషల్ మీడియా వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి అరూరి విశాల్, బీఆర్ఎస్ ఒకటో డివిజన్ అధ్యక్షుడు నరెడ్ల శ్రీధర్, రెండో డివిజన్ అధ్యక్షుడు జంగ కుమార్యాదవ్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మేరుగు రాజేశ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ గండు అశోక్ యాదవ్, గంథ్రాలయ సంస్థ డైరెక్టర్ సముద్రాల మధు, ఆత్మ డైరెక్టర్ గనిపాక కల్పన, వెంకటేశ్, చల్లా వెంకటేశ్వర్రెడ్డి, దోమ కుమార్, లోకేశ్, కుమార్యాదవ్ పాల్గొన్నారు.
నా భర్తను కాపాడింది బీఆర్ఎస్ పార్టీనే..
కరోనా సమయంలో నా భర్త అనారోగ్యంతో బాధపడుతుండగా హనుమకొండలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించాం. పుస్తెలతాడు అమ్మి ఉన్న డబ్బులు ఖర్చు పెట్టిన. చేతుల చిల్లి గవ్వకూడా లేదు. అప్పడు గ్రామంలోని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే అరూరి రమేశ్ దృష్టికి తీసుకు పోయిండ్లు. వెంటనే మాకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం అందించి, ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.60 వేలు ఇప్పించిండు. ఆ డబ్బులతో అప్పులు కట్టిన. మా కుటుంబాన్ని ఆదుకున్న కేసీఆర్ సార్, అరూరి రమేశ్ అన్నకు రుణపడి ఉంటాం. – పూజారి అరుణ, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారు పలివేల్పుల