మడికొండ, ఏప్రిల్ 3 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకూ అందుతున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. కల్యాణలక్ష్మి, ఆసరా, షాదీముబారక్, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు, సాగునీటి కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ప్రజల గుండెల్లో సీఎం కేసీఆర్ నిలిచిపోయారన్నారు. 44వ డివిజన్ భట్టుపల్లిలోని ఏజీఆర్ గార్డెన్స్లో 43, 44, 45వ డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సోమవారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు యువకులు బైకు ర్యాలీ, గజమాలతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో 14 ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయని విద్యావంతులు గమనించాలని కోరారు. అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారన్నారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు గ్రామాల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూ చించారు. ఆసరా ఫించన్లను రూ.3వేలు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్, బీజేపీ తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ సం పదను దోచుకుని, తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా ప్రధాని మోదీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పెట్రో ల్, డీజిల్, గ్యాస్, పప్పు, ఉప్పు, కూరగాయ లు వంటి నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేదలపై భారం మోపారన్నారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచనతో ప్రభుత్వ, ప్రైవేటుపరంగా సుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు గుర్తు చేశారు. ఈ ప్రాంత నిరుద్యోగుల ఉపాధి కోసం కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని రాష్ట్రం ప్రభు త్వం భూమి కేటాయిస్తే ఇప్పటి వరకు కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉకు కర్మాగారం, కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేయకుండా తెలంగాణపై మోదీ సరారు విషం చిమ్ముతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి కోసం ఆకేరు వాగు పై చెక్ డ్యాంలు, 45 వేల గొలుసు కట్టు చెరువులకు మరమ్మతు చేయించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దకుతుందన్నారు. కేవలం మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఎండాకాలంలో కూడా చెరువులు, కుంటలు నింపి భూగర్భల జలాలను పెంచేలా సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు. దశలవారీగా దళిత బంధు పథకాన్ని అర్హులందరికీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
దేశ రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు కేసీఆర్ శ్రీకారం చుట్టారని, ఢిల్లీ కోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. అనంతరం మంగళవారం ఎమ్మెల్యే జన్మదినం పురస్కరించుకుని నాయకులు ఆయనతో కేక్ కట్ చేయించి, సంబురాలు జరుపుకున్నారు. అంతకుముందు కళాకారులు ఆటపాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆత్మీయ సమ్మేళనంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, సోషల్ మీడియా నియోజకవర్గ కన్వీనర్ అరూరి విశా ల్, 43వ డివిజన్ కార్పొరేటర్ ఈదురు అరుణ, డివిజన్ అధ్యక్షుడు అకపెళ్లి స్పందన్, 44వ డివిజన్ అధ్యక్షుడు దోపతి జయపాల్రెడ్డి, 45వ డివిజన్ అధ్యక్షుడు మేరుగు రమేశ్, నాయకులు బసే శ్రీలేఖ, మేకల సారయ్య, పూజారి వీరభద్రయ్య, బొందుగుల వేణు, చివ్వరాజు యాదవ్, గాదెం యాదగిరి, బొమ్మినేని రామచంద్రారెడ్డి, ఊకంటి వనంరెడ్డి, నల్లమారి రమేశ్, కర్ర హరీష్రెడ్డి, అంకేశ్వరపు రవి, అరూరి రంజిత్కుమార్, మాతంగి మహేందర్, ముచ్చు భిక్షపతి, పైడిపాల సది, గర్నెపల్లి హరికృష్ణ, బొందుగుల శ్యాం పాల్గొన్నారు.
విలీన గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ
గ్రేటర్లో విలీనమైన గ్రామాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అరూరి రమేశ్ శ్రద్ధ చూపారు. ప్రతి సమావేశంలో గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వాలు మహిళలను పట్టించుకోలేదు. మహిళా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ప్రతి పేదింటికి మేనమామ పాత్ర పోషించి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కార్పొరేషన్ పరిధిలో మహిళల కోసం వివిధ వృత్తి శిక్షణ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– మేయర్ గుండు సుధారాణి
ఎన్నికల వేళ తుపాకీ రాముళ్లు వస్తుంటారు
ఎన్నికలు వస్తున్న వేళ మాయ మాటలు చెప్పేందుకు కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల నుంచి తుపాకీ రాముళ్లు వస్తుంటారు. వారికి తగిన గుణపాఠం చెప్పాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి పేద బతుకులపై కేంద్రం అధిక భారం మోపుతున్నది. కానీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజల అవసరాలు తెలుసుకొని సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారు. ఇటీవల అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి బాధితులతో మాట్లాడారు. ఎకరానికి రూ.10వేలు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎవరైనా పంట నష్టం బాధితులను పరామర్శించిన దాఖలాలు లేవు.
– ఎల్లావుల లలితాయాదవ్, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్