పోచమ్మమైదాన్, మార్చి 16: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తోందని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ 12వ డివిజన్ దేశాయిపేటలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులను ముస్లిం మతపెద్దలు, మైనార్టీ నాయకులు, కార్పొరేటర్లతో కలిసి గురువారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీ ఆర్ ముందుచూపుతో రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, తదితర పేద విద్యార్థులకు విద్యావకాశాలు పెరిగాయని అన్నారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుత విజయాలు సాధిస్తూ దేశంలోని ప్రముఖ యూనివర్సిటీ ల్లో సీట్లు సాధిస్తున్నారని, ముఖ్యంగా నీట్, ఐఐటీ విద్యా సంస్థల పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటుతున్నారని చెప్పారు.
తెలంగాణ రాకముందు రాష్ట్రంలో కేవలం 10 మైనా ర్టీ పాఠశాలలు ఉండగా, ప్రస్తుతం సీఎం కేసీఆర్ నాయ కత్వంలో 270 స్కూళ్లను ఏర్పాటు చేశామని పేర్కొ న్నారు. తూర్పు నియోజక వర్గంలో ఏడు గురుకులాలు, రెండు డిగ్రీ కళాశాలలు ఏర్పా టు చేసి పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్యావకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు కావటి కవితా రాజుయాదవ్, సురేశ్కుమార్ జోషి, ఎండీ పుర్ఖాన్, జిల్లా మైనార్టీ అధికారి విక్రమ్కుమార్, మైనార్టీ సంక్షేమాధి కారి ఎం శ్రీను, ఆర్ఎల్సీ శ్రీపాల, ప్రిన్సిపాల్ కృష్ణకుమా రి, మాధవి, భిక్షపతి, విజిలెన్స్ అధికారులు మక్బూల్ పాషా, అంజద్ అలీ, ఆకాడమిక్ కోఆర్డినేటర్ రుహినా, కౌన్సిలర్ సర్వర్ పాల్గొన్నారు.