వరంగల్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభివృద్ధి నిధుల వినియోగంలో ఇన్చార్జి మంత్రి ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో ఆయన సమన్వయం చేస్తారు.