భూపాలపల్లి టౌన్, జనవరి 5 : ‘కంటి వెలుగు’ను గిన్నిస్ బుక్లో రికార్డు చేసేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ అతిథి గృహంలో కంటి వెలుగుపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమీక్షించారు. కార్యక్రమానికి మంత్రి సత్యవతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, కలెక్టర్ భవేశ్ మిశ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా కంటి వెలుగు ప్రారంభించారన్నారు.
ఈ నెల 18 నుం చి రెండో విడుత కంటి వెలుగు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారం భం అవుతున్నట్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ కార్యక్రమ విజయవంతానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యశాఖ అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ శిబిరానికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన ఈ కార్యక్రమం అతిపెద్ద సామాజిక సేవగా అభివర్ణించారు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కంటి సంబంధిత సమ స్య ఉంటుందని, ప్రభుత్వం చేపట్టిన పరీక్షల ద్వారా తెలుస్తుందన్నారు.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవారు తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఆయా గ్రామాల్లో శిబిరాలు నిర్వహించే సమయంలో ప్రజాప్రతినిధులు వైద్యులకు సహకరించాలన్నారు. అనంతరం కలెక్టర్ భవేశ్మిశ్రా మాట్లాడుతూ జిల్లాలోని 241 గ్రామపంచాయతీలు, 391 హ్యాబిటేషన్లలో చేపట్టనున్న కంటివెలుగు విజయవంతానికి 25 టీంలను ఏర్పాటు చేశామని, ప్రతి టీంకు ఒక మొబైల్ కిట్ ఇస్తామన్నారు. శిబిరాల విజయవంతానికి వైద్యు లు, సిబ్బంది, వైద్య పరికరాలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించామన్నారు. అదేవిధంగా సంక్రాంతి లోపు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు పూర్తి చేస్తామన్నారు.
ఆశ వర్కర్లు ఇంటింటికీ తిరిగి ఆహ్వాన పత్రికలు అందజేసి క్యాంపునకు హాజరయ్యేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ శ్రీరాం, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఉమాదేవి, శ్రీదేవి, హెల్త్ ఎడ్యుకేటర్ (డెమో) శ్రీదేవి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేశ్, ఎంపీపీ లు మందల లావణ్య, రాణీబాయి, జడ్పీటీసీలు పులి తిరుపతిరెడ్డి, జోరుక సదయ్య, గొర్రె సాగర్, జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు, అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సిబ్బంది, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
ములుగుటౌన్ : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కంటి వెలుగు-2పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. జనవరి 18 నుంచి ప్రారంభం కానున్న కార్యక్రమంలో 18 ఏళ్లకు పైగా వయసు ఉన్న వారు కంటి పరీక్షలు చేయిచుకోవాలన్నారు.
ఈ నెల 12వ తేదీ లోపు అధికారులు, ప్రజాప్రతినిధులు మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. ములుగు జిల్లాలో 20 టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాల వారీగా క్యాంపు వివరాలు తెలుపుతూ డప్పు చాటింపు వేయించాలని సూచించా రు. మొదటిదశ విజయవంతమైనట్టుగానే రెండో దశనూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కంటి పరీక్షల అనంతరం మందులతో పాటు అద్దాలను ఏఎన్ఎంల ద్వారా ఆశ వరర్లు బాధితుల ఇంటికి తీసుకెళ్లి ఇవ్వాలన్నారు.
కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ జిల్లాలో 1188 హ్యాబిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, వాటి ద్వారా 2 లక్షల 8వేల మందికి పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొరిక గోవింద్నాయక్, డీఎంహెచ్వో అప్పయ్య, డీఆర్వో రమాదేవి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.