హసన్పర్తి, మే 5 : సంక్రాంతి వేడుకల సందర్భంగా అరూరి గట్టుమట్టు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్యర్యంలో కేసీఆర్ ప్రీమియర్ లీగ్-2023 క్రికెట్ పోటీలు నిర్వహించగా ప్రథమ బహుమతి 65వ డివిజన్ మధు తండా, ద్వితీయ బహుమతి హసన్పర్తి మండలంలోని జయగిరి జట్టు గెలుచుకుంది. ప్రథమ బహుమతి కింద రూ.1.16 లక్షలు, ద్వితీయ బహుమతి కింద రూ.50.16 వేలు అందజేశారు. అలాగే, పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన కేసీఆర్ ప్రీమియర్ లీగ్లో 7వ డివిజన్ ప్రథమ బహుమతి కింద రూ.75 వేలు, 47వ డివిజన్ ద్వితీయ బహుమతి కింద రూ.50 వేలు గెలుచుకుంది.
వీటిని ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ శుక్రవారం కిట్స్ కళాశాల ఆడిటోరియంలో క్రీడాకారులకు అందజేశారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్, కార్పొరేటర్లు గుగులోత్ దివ్యరాణీ రాజునాయక్, జక్కుల రజితా వెంకటేశ్వర్లు, ఎంపీపీ సునీత, జడ్పీటీసీ సునీత, పార్టీ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, డివిజన్ అధ్యక్షులు నరెడ ్లశ్రీధర్, పాపిశెట్టి శ్రీధర్, మార్కెట్ డైరెక్టర్లు వీసం సురేందర్రెడ్డి, చకిలం రాజేశ్వర్రావు, నాయకులు చల్లా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.