వరంగల్ : నర్సంపేట వాసులు అదృష్టవంతులు అని.. ఇక్కడికి గోదావరి, దేవాదుల నీళ్లు వస్తున్నాయి అని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. నర్సంపేట కమ్యూనిటీ హాస్పిటల్ను 58 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జిల్లా స్థాయి హాస్పిటల్గా అభివృద్ధి చేసేందుకు, 1.25 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే టి.డయాగ్నస్టిక్ సెంటర్, 4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే 25 హెల్త్ సబ్ సెంటర్లకు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్తో కలిసి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.
ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు… ఆనాటి ఉద్యమంలోనే కాదు నేడు నర్సంపేట అభివృద్ధిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టి నర్సంపేటలో 66 కోట్ల రూపాయలతో 330 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకున్నాం. వరంగల్ వెళ్లకుండా నర్సంపేటలో వైద్యం అందే మంచి కార్యక్రమం ఇది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దీనిని చాలా ఉపాయంగా తెచ్చారు. జిల్లా కేంద్రంలో ఉండేదానిని ఇక్కడకు తెచ్చారు. టి.డయాగ్నస్టిక్ సెంటర్ కూడా జిల్లా కేంద్రంలో కాకుండా ఇక్కడకు తెచ్చారు. 57 పరీక్షలు ఇక్కడ ఉచితంగా చేస్తారు. ఒకేసారి 26 సబ్ సెంటర్లను ఇచ్చిన ఘనత నర్సంపేటకు దక్కింది. ఇంకో 13 ఏఎన్ఎం సబ్ సెంటర్లను మంజూరు చేస్తున్నాను. గత 5 ఏండ్లు నర్సంపేట.. ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్ రెడ్డి లేకపోవడం వల్ల నష్టపోయింది. కానీ ఎమ్మెల్యే అయ్యాక గత నష్టాన్ని కూడా పూడ్చుతున్నారని మంత్రి అన్నారు.