హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 28: ఓరుగ ల్లు గడ్డమీద పుట్టిన మహనీయుడు, మిమిక్రీ కళకే ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి నేరెళ్ల వేణుమాధవ్ అని కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ కొనియాడారు. వేణుమా ధవ్ 91వ జయంతి సందర్భంగా బుధవారం హ నుమకొండ పబ్లిక్ గార్డెన్లోని నేరెళ్ల వేణు మాధవ్ కళాప్రాంగణంలో స్వరార్చన కార్యక్రమం తెలం గాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజ న్యంతో, మిమిక్రీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసో సియేషన్ సహకా రంతో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ ఓరుగల్లు కళాకారులకు పుట్టినిల్లు అని అన్నారు. వరంగల్ గడ్డమీద పుట్టిన గొప్ప కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ అని కొనియాడా రు. ఆయన ఇక్కడ పుట్టడం ఎంతో అదృష్టమని అన్నారు.
నేరెళ్ల వేణుమాధవ్ ప్రతిభా పురసార గ్రహీత చిత్తరంజన్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వేలాది కార్యక్రమాలు వందలాది పుర సారాలు పొందిన మహోన్నత వ్యక్తి వేణు మాధవ్ అన్నా రు. మిమిక్రీ కళను వేలాదిమందికి అందించిన వ్యక్తి నేరెళ్ల వేణుమాధవ్ అని కాక తీయ యూని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ అన్నా రు. వేణుమాధవ్ స్ఫూర్తితోనే కాక తీయ విశ్వవి ద్యాలయ పరిధిలో మిమిక్రీ కోర్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. మిమిక్రీ అభ్యసన అంత సులువు కాదని, దాంట్లో ప్రపంచంలోనే అత్యంత నిష్ణాతుడు వేణుమాధవ్ అని ఈ సంద ర్భంగా కొనియాడారు. ఆయన సతీమణి శోభా వతి నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో కుర్చీల ఏర్పాటు కోసం రూ. లక్ష రూపాయలు అంద జేస్తు న్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అనంతరం నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో వేణుమా ధవ్ శిష్యులు, ప్రముఖ మిమిక్రీ కళాకారుల ధ్వన్యను కరణ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుం ది. మి మిక్రీ కళాకారులు ప్రముఖ హీరోలు, ప్రజాప్రతి నిధుల వాయిస్తో మిమిక్రీ చేసి అందరినీ నవ్వించారు.
చిత్తరంజన్కు పురస్కారం..
ప్రఖ్యాత సినీగాయకుడు, సంగీత దర్శకులు, లలిత సంగీత సామ్రాట్ డాక్టర్ మహాభాష్యం చిత్తరంజన్కు నేరెళ్ల వేణుమాధవ్ స్మారక ప్రతిభా పురస్కారం అందించారు. ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో మిమిక్రీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ అధ్యక్షుడు చంద్ర ముఖి చంద్రశేఖర్, కార్యదర్శి వెంకట్ పంబాల, నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ అధ్యక్షులు నేరెళ్ల శోభావేణు మాధవ్, కార్య దర్శి డాక్టర్ అంపశయ్య నవీన్, శాశ్వత సభ్యులు నేరెళ్ల శోభావతి, నేరెళ్ల శ్రీనాథ్, నేరెళ్ల రాధాకృష్ణ, సలహామండలి సభ్యు లు డాక్టర్ బండారు ఉమామహేశ్వర్రావు, డాక్టర్ గిరిజా మనోహర్బాబు, అత్తలూరి సత్యనారాయణ, వరి గొండ కాంతారావు, వనం లక్ష్మీకాం తారావు, కొ ణతం కృష్ణ, రామాచంద్రమౌళి, పొట్లపల్లి శ్రీనివా సరావు, మిమిక్రీ ఆర్టిస్టులు పాల్గొన్నారు.