హనుమకొండ చౌరస్తా, మార్చి 21 : ఆధ్యాత్మికతతో మానసిక పరిపక్వత సాధ్యమని కేయూ వీసీ తాటికొండ రమేశ్ అన్నారు. సెనేట్ హాల్లో గురువారం రిజిస్ట్రార్ మల్లారెడ్డి అధ్యక్షతన ధ్యానం, రిలాక్సేషన్, స్వచ్ఛతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత చాలా ఒత్తిడి లో ఉన్నారని, సవాళ్లను ఎదురోవాలంటే ప్రశాంత జీవితం, సవ్యమైన ఆలోచనా సరళి ఉండాలన్నా రు. మాజీ డీజీపీ ఆదిత్య ఆర్య మాట్లాడుతూ ధ్యానంతో మనస్సు, హృదయాన్ని సమన్వయపర్చొచ్చన్నారు. యూఎస్ఏ నుంచి వచ్చిన డాక్టర్ అరిహంత మాధవమోహన్ మాట్లాడుతూ.. అంతర్గత శాంతి ద్వారా బహిర్గత శాంతి వస్తుందన్నారు. లోకల్ ఇన్చార్జ్ శారద, రమణ, అచ్చయ్య పాల్గొన్నారు.