ఏటూరునాగారం, జనవరి 12 : ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 20న ములుగు మండలం జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో అంకిత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెగా జాబ్ మేళాలో 20 బహుళ జాతి కంపెనీలకు చెందిన వారు పాల్గొంటారని పీవో వెల్లడించారు.
ప్రతి నెలా రూ. 15నుంచి 30వేల వేతనం పొందే అవకాశం ఉందన్నారు. పది, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బీటెక్ చదివిన వారికి అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉన్న వారు అర్హులని ఆయన తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు తమ బయోడేటా, విద్యార్హత జిరాక్స్ ప్రతులతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు. పూర్తి సమాచారం కోసం 8008932159,7981633716 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని పీవో తెలిపారు.