వరంగల్, ఆగస్టు 4: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను అసెంబ్లీలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి కలిశారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ని కలిసిన ఆమె వరంగల్లో ముంపు ప్రాంతాల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాలతో 152 లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని ఆమె మంత్రికి వివరించారు.
వర్షాలతో రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, తాగునీటి పైపులైన్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. సుమారు రూ.450 కోట్ల మేరకు వరద నష్టం సంభవించినట్లు మంత్రికి వివరించారు. వరదలతో ధ్వంసమైన రోడ్లు, డ్రైనేజీల పునరుద్ధరణ కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించినట్లు మేయర్ తెలిపారు.