వరంగల్, మే 1 : సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని నగర మేయర్ గుండు సుధారాణి అన్నా రు. సోమవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం పురష్కరించుకుని ఆమె బల్దియా ఆవరణలో జెండాను ఆవిష్కరించారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా బల్దియా కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరంగా శ్రమిస్తోందన్నారు. కార్మికుల కోసం కార్మిక భవనాలు నిర్మిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేకంగా మహిళా క్లినిక్లను ప్రారంభించిన ఘనతా తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. కరో నా కాలంలో పారిశుధ్య కార్మికులు అందించిన సేవలు వెలకట్టలేనివన్నారు. స్వచ్ఛ ఆటో డ్రైవర్లు కమ్ ఓనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. అర్బన్ మలేరియా విభాగంలో దినసరి కూలిపై పనిచేస్తున్న 90 మంది కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, సీఎంహెచ్వో రాజేశ్, శానిటరీ సూపర్వైజర్ ఎం సాంబ య్య, భాస్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్యామ్రాజ్, సంపత్రెడ్డి, రవీందర్, కరుణాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
హనుమకొండ సిటీ : ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని హంటర్రోడ్డులోని టీఎస్యూటీఎప్ జిల్లా కార్యాలయంలో మేడే వేడుకలు హనుమకొండ జిల్లా ఆధ్యక్షుడు ఎం సదాశివరెడ్డి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల యూనియన్ బాధ్యులు కుమార్, పెండెం రాజు, బీ వెంకట్ రెడ్డి, డీ కిరణ్కుమార్, సుజన్ప్రసాద్, మేకరి దమోదర్, కుమారస్వామి, వెంకటేశ్వరరావు, సీహెచ్ లింగారావు, పీ చంద్రయ్య, తిరునగిరి శ్రీనివాస్, కరుణాకర్, భాస్కరరావు, సదానందం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాజీపేట: కాజీపేట రైల్వే జంక్షన్, పట్టణంలోని పలు ప్రాంతాల్లోని ముఖ్య కూడళీలు, పలు ప్రభుత్వ, ప్రభుత్వేతర, రైల్వే కార్యాలయాల్లో కార్మికులు 137వ మే డే సోమవారం ఘనంగా నిర్వహించారు. రైల్వే కార్మికులు, ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఎర్రజెండాను ఎగురవేసి, మే డే వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో వ్యాపారవేత్తలు మహేందర్, వెంకటేశ్వర్లతో పాటు సంఘం నాయకులు జలీల్, ప్రభాకర్, రబ్బానీ, రాజు, రాజ్కుమార్, దేవదాస్, ఐలే శ్, మల్లేశ్, లక్ష్మణ్, రామకృష్ణ, సురేశ్, భిక్షపతి, బషీర్, దాస్ , సమితి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సులోచన, వర్కింగ్ ప్రెసిడెంట్ విలియం, కృష్ణమూర్తి, యూనియన్ అధ్యక్షుడు గడ్డం నరహరి, సత్యనారాయణ, భూక్యా శంకర్ నాయక్, బొక్క స్వామి, రవి, సుధాకర్, రఫీ, నజీరొద్ధీన్, జాకీ , మల్లేశం, గడ్డం అశోక్, బీ భిక్షపతి, ధర్మరాజు, మహేశ్, బాబు, వెంకటయ్య, సుధాకర్ రెడ్డి, దేవయ్య, సుశీల్, మల్లయ్య పాల్గొన్నారు.
న్యూశాయంపేట: ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ మామిండ్ల రాజు పాల్గొన్ని జెండాను ఆవిష్కరించారు. అలాగే న్యూశాయంపేట జంక్షన్లో హనుమకొండ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వీ సారంగపాణి ఆధ్వర్యంలో మేడే ఘనంగా నిర్వహించారు. రాజరాజేశ్వర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేల్పుల సాంబమూర్తి, బీఆర్ఎస్ మాజీ డివిజన్ అధ్యక్షుడు వీ వేణుగోపాల్, పలు యూనియన్ నాయకులు భాస్కర్, ఇంద్రసేన, అనిల్కుమార్, స్వామి, శ్రీనివాస్, సువర్ణ పాల్గొన్నారు.
భీమదేవరపల్లి: మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం మే డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ గ్రామానా కార్మికులు కార్మిక జెండాను ఎగురవేశారు. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని సీపీఐ రాష్ట్రసమితి సభ్యుడు అదరి శ్రీనివాస్ తెలిపారు. సీపీఐ నాయకులు మంచాల రమాదేవి, తిరుపతి, రాంచంద్రారెడ్డి, ఏ రమేశ్, మార్పు కృష్ణారెడ్డి, రావుల తిరుపతి, ఎన్ సదానందం, కే యాదగిరి, వెంకట్రాజం, రవి, స్వప్న, ఉమ, పద్మ పాల్గొన్నారు.
ఎల్కతుర్తి: మండలంలోని అన్ని గ్రామాల్లో కార్మికులు ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్కేవీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఆటో యూనియన్ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎల్కతుర్తితో పాటు ఆయా గ్రామాల్లో జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా కార్మిక సంఘాల నాయకులు కౌడ శ్రీనివాస్, పులింటి శ్రీనివాస్, రామ్మూర్త్తి, తంగెడ మహేందర్, ఎం సంపత్, శనిగరపు రాజుకుమార్, కొలిపాక రవీందర్, పులింటి రాములు, ఆరెపల్లి చంద్రమౌళి, టీ మొండయ్య, మేకల విజయ, బీ ఐలయ్య, ఏ రమేశ్, ఏ కుమార్, జే కనకయ్య, హరీశ్, శ్రీనివాస్, రాజయ్య, ఎం భిక్షపతి, చంద్రమౌళి, ప్రేమ్సింగ్, అనిల్రాజు, కార్మికులు పాల్గొన్నారు.
కమలాపూర్: మండలంలోని కమలాపూర్, ఉప్పల్, శనిగరం, మర్రిపెల్లిగూడెం, గూడూరు, అంబాల, శ్రీరాంలపల్లి, కన్నూరు, వంగపల్లి తదితర గ్రామాల్లో మేడే సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉప్పల్ రైల్వే యార్డులో డంపింగ్ కార్మికులు జెండాను ఎగురవేశారు. కమలాపూర్లో సీపీఐ, ఏఐటీయూసీ కార్మిక నాయకులు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికుల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సినవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
ధర్మసాగర్: మండలంలోని పలు గ్రామాల్లో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో సీపీఐ మండల కార్యదర్శి బట్టు మల్లయ్య పెద్దపెండ్యాల గ్రామంలోని గుడిసెల వద్ద సీపీఐ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు కొట్టె ప్రభాకర్, గ్రామ కార్యదర్శి చిలుక బాబు, కర్ర రాజిరెడ్డి, కొమురయ్య, రాజయ్య, దేవదాసు, పెద్దపెండ్యాలలో గ్రామ కార్యదర్శి రాజయ్య, కమిటీ సభ్యులు రాజారపు రత్నం, దేవన్న, గట్టయ్య పాల్గొన్నారు.