హనుమకొండ చౌరస్తా, నవంబర్ 22 : మాస సందర్భంగా మంగళవారం జిల్లా వ్యాప్తం గా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం రుద్రేశ్వరీ-రుద్రేశ్వరుల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించించారు. బోసు ప్రమోద్-రజిత దంపతుల సౌజన్యంతో మధ్యాహ్నం మహాన్నదానం చేశారు. కల్యాణ క్రతువును కోమల్లపల్లి సంపత్కుమార్శర్మ ఆధ్వర్యంలో నిర్వహించగా వేదపండితులు గంగు మణికంఠశర్మ, ప్రణవ్, మేఘశ్యాం, సుహాస్శర్మ, ప్రక్యాత్శర్మ తదితరులు పూజలు చేశారు.
ఐలోని మల్లన్న ఆలయంలో..
ఐనవోలు : ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ఒగ్గు పూజారులు మెలుకొలుపు నిర్వహించారు. అర్చకులు రుద్రహోమం, కల్యాణం చేశారు. ఒగ్గు పూజారులు ముఖ మండపంలో పెద్ద పట్నం వేసి కల్యాణం నిర్వహించారు. ఈవో అద్దంకి నాగేశ్వర్రావు, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, వేద పారాయణదారులు గుట్ట పురుశోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జ్యోషి, నందనం భానుప్రసాద్, ఉప్పల శ్రీనివాస్ పాల్గొన్నారు.
సిద్ధేశ్వరాలయంలో..
హనుమకొండ : పద్మాక్షి కాలనీలోని సిద్ధేశ్వరాలయంలో స్వామివారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే, సాయంత్రం ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామి ( రాహు, కేతు)కి ప్రత్యేకంగా దీపాలంకరణ చేసినట్లు అర్చకులు సిద్ధేశుని రవికుమార్, సురేశ్కుమార్ తెలిపారు.
శ్వేతార్క ఆలయంలో..
కాజీపేట : కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి ఆలయంలో మాస శివరాత్రి, భౌమ చతుర్దశి నిర్వహించారు. అయినవోలు రాధాకృష్ణ శర్మ, సాయికృష్ణ శర్మ ఆధ్వర్యంలో గోదావరి గంగా జలంతో స్వామికి అభిషేకం, గరిక పూజలు నిర్వహించారు. సంతాన నాగలింగేశ్వరస్వామికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు చేపట్టారు. కార్పొరేటర్ జక్కుల రవీందర్ పాల్గొని పూజలు చేశారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదానం చేశారు.