మడికొండ, ఏప్రిల్ 19: వరకట్న వేధింపులు తట్టుకోలే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తన నాలుగేళ్ల బిడ్డ గొంతు నులిమి చంపి ఉరేసుకుంది. మడికొండ ఇన్స్పెక్టర్ వేణు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఛాగల్ గ్రామానికి చెందిన నీల అనిత(28) హనుమకొండ జిల్లా తరాలపల్లి గ్రామానికి చెందిన ఈరబోయిన రాకేశ్ను ఐదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. వీరికి నాలుగేళ్ల కూతురు శివ శాన్విత ఉంది.
ఈ క్రమంలో వరకట్నం కోసం తరచూ వేధిస్తుండడంతో బుధవారం అనిత తన కూతురు గొంతు నులిమి చంపి తాను సీలింగ్ ప్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరకుని మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం దవాఖానకు తరలించారు. మృతురాలి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త రాకేశ్, అత్త రమాదేవి, మామ భిక్షపతి, భర్త తమ్ముళ్లు వినోద్, రిత్విక్పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.