ఏటూరునాగారం, నవంబర్ 29: వెంకటాపురం మండ లం ముత్తారం క్రాస్ రోడ్డు వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఆరుగురు మావోయిస్టు మిలిషీ యా కమిటీ సభ్యులు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకు ని ఆరెస్టు చేశారు. ఈ మేరకు ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్కుమార్ మంగళవారం తన కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
సీతారాంపురం, కాలిపాక గ్రామానికి చెందిన కుర్సం రాం బాబు, బడిసె బాలరాజు, కుంజ శంకర్, కుర్సం మల్లయ్య, గట్టుపల్లి రాంబాబు, కోరం సత్యంను అరెస్టు చేసి, వారి నుంచి పీఎల్జీఏ వారోత్సవాల కరపత్రాలను స్వాధీనం చేసుకున్నాం. ఇందులో ఐదురుగు 2018 నుంచి మావో యిస్టులకు సహాయ సహకారాలు అందిస్తూ మిలీషియా సభ్యులుగా పదోన్నతి పొంవిరు. అంతేకాకుండా వాజేడు-వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ను తర చూ కలిసి పార్టీ పనులు చేస్తున్నారు.
వారం రోజుల క్రితం ఛత్తీస్గఢ్లోని ఊట్లపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లి మావో యిస్టు అగ్రనాయకులు, సుధాకర్ను కలిసినట్లు తమ విచా రణలో వెల్లడైంది. ఈ ఆరుగురు కూడా పీఎల్జీఏ వారో త్సవా లకు సంబంధించిన కరపత్రాలను ఆలుబాక సమీ పంలోని రోడ్డుపై వేసేందుకు వస్తున్న క్రమంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా భయంతో పరుగెత్తేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారిని విచారించగా వారి వద్ద కరపత్రాలు లభ్యమైనట్లు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనట్లుగా వాస్తవాలను ఒప్పు కున్నట్లు ఏఎస్పీ తెలిపారు. అరెస్టు చేసిన ఆరుగురిని కో ర్టులో హాజరుపర్చామన్నారు. ప్రజలు నిషేధిత మావోయి స్టు పార్టీకి సహకరించవద్దని, చట్ట వ్యతిరేక కార్యకలాపా లకు పాల్పడవద్దని కోరారు. వారి స్వప్రయోజనాలకు మా వోయిస్టులు పనిచేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో వెంకటాపురం సీఐ శివప్రసాద్, ఎస్సై తిరుపతి, సీఆర్పీఎఫ్ సీఐ ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.