ఐనవోలు, జనవరి 18: ఐనవోలు మల్లికార్జునస్వామి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 18 రోజులకు 18 హుండీల ద్వారా రూ. 31,36,817, టికెట్ల ద్వారా రూ. 69,33,448 సమకూరింది. మొత్తం రూ. 1,00,70,265 వచ్చినట్లు ఈవో అద్దంకి నాగేశ్వర్రావు వెల్లడించారు. లెక్కింపులో పరిశీలకులుగా ఎండోమెంట్ నుంచి జీ సంజీవరెడ్డి, ఈవో అద్దంకి నాగేశ్వర్రావు, ఆర్ఐ మల్లయ్య, ఎస్సై అనిల్కుమార్, ఏఎస్సై సత్యనారాయణ, కానిస్టేబుళ్లు రాకేశ్, రఘునరెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు, మహబూబాబాద్ శ్రీలక్ష్మీవేంకటేశ్వర సేవా సమితి సభ్యులు, అర్చకులు, సిబ్బంది కిరణ్, మధుకర్, శ్రీకాంత్, కన్నయ్య, రాజు పొల్గొన్నారు.