సంగెం, ఆగష్టు 18 : రాష్ట్రంలో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మనమే గెలుస్తున్నమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సంగెం మండలంలోని వెంకటాపురంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, మహిళ భవనం, సీసీ రోడ్లను కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. అనంతరం 142 మంది రైతులకు పం ట నష్టపరిహారం రూ.14.37లక్షల చెక్కులను అందించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఎలా ఉండేదో ప్రస్తు తం సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి ఎలా జరిగిందో ప్రజలు గమనించాలన్నారు. రైతు లు పంటలు నష్టపోతే పంటలను పరిశీలించిన సీఎం కేసీఆర్ ఎకరానికి రూ.10వేలు అందించిన మహాత్ముడన్నారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫి చేసి రైతు పక్షపాతిగా నిలిచారన్నారు. సెప్టెంబర్ 15 వరకు రుణమాఫీ పూర్తవుతుందన్నారు. మండలంలోని పలు గ్రామాలకు అనుసంధానంగా ఉండే 6 రహదారులకు రూ.18.45కోట్ల నిధులు మం జూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, డీఏవో ఉషాదయాళ్, మండల రైతుబంధు కన్వీనర్ కందకట్ల నరహరి, గ్రామ సర్పంచ్ పూజారి ఉమాదేవి-గోవర్దన్గౌడ్, ఎంపీటీసీ గాయపు ప్రచూర్ణ-భాస్కర్రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, తహసీల్దార్ రాజ్కుమార్, పీఆర్ డీఈ జ్ఞానేశ్వర్, ఏఈ రమేశ్, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, ఏఓ యాకయ్య, గుగులోతు వీరమ్మ, దొనికెల శ్రీనివాస్, పసునూరి సారంగపాణి పాల్గొన్నారు.
పదేళ్లలో వందేళ్ల అభివృద్ది
నడికూడ : పదేళ్లలో వందేళ్ల అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ చేసిన కృషే కారణమని ఎమ్మె ల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని చర్లపల్లి, రాయపర్తి, నడికూడ గ్రామాల్లో రూ.3.68కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సం దర్భంగా కోలాటాలు, డప్పు చప్పుల్లతో మహిళలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేశారు. నూతన జీపీ కార్యాలయం, మహిళా భవనాన్ని ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ ఊర రవీందర్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశానికే దిక్సూచిగా తెలంగాణను నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. అనంతరం బస్టాండ్ వద్ద పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసే స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మచ్చ అనసూర్య, జడ్పీటీసీ కోడెపాక సుమలత, వైస్ ఎంపీపీ చందా కుమారస్వామి, డీఈ లింగారెడ్డి, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతిరెడ్డి, బొల్లె భిక్షపతి, తిప్పర్తి సాంబశివారెడ్డి, రాయపర్తి సర్పంచ్ రావుల సరితా రాజిరెడ్డి, పర్నెం తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ అప్పం చేరాలు, ఉప సర్పంచ్ కిన్నెర మణి, చర్లపల్లిలో సర్పంచ్ చాడ తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. కాగా, త్వరలోనే జర్నలిస్టులకు ఇంటి స్థలాల పట్టాలు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.