తొర్రూరు, జూన్ 9: ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్య అందుతుందని జడ్పీఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని మాటేడులో‘మన ఊరు-మన బడి’లో భాగంగా మంజూరైన పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ స్థాయిలో విద్య అందించేందుకు సర్కారు చర్యలు చేపట్టిందన్నారు. ప్రాథమిక, సెకండరీ విద్యను పటిష్టపర్చేందుకు మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. మాటేడులో ప్రాథమిక పాఠశాలకు రూ.21లక్షలు, హైస్కూల్కు రూ.21లక్షలు మంజూరు అయ్యాయని, ఈ విద్యా సంవత్సరంలో పనులు పూర్తి చేయాలని, స్కూల్ యాజమాన్య కమిటీలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దీకొండ కవితాభిక్షపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, వల్లపు యాకయ్య, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షుడు కొమురారెడ్డి, యాజమాన్య కమిటీ చైర్మన్లు, హెచ్ఎంలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
డోర్నకల్ (కురవి): కాంపెల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఉప్పరిగూడెంలో గురువారం బడిబాట నిర్వహించారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, సరారు కల్పిస్తున్న సౌకర్యాలు పూర్వవిద్యార్థుల ఫలితాలు, ఆంగ్లమాధ్యమ బోధన, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులపంపిణీ, స్కాలర్షిప్, సైన్స్ ల్యాబ్ గురించి తల్లిదండ్రులకు హెచ్ఎం కే లక్ష్మీనారాయణ వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, శంకర్శ్రీలక్ష్మి, వజ్రకుమారి, గీతాకుమారి, సోమేశ్వర్, హరిత, రమేశ్, విద్యాకమిటీ చైర్మన్ పాల్గొన్నారు.
నెల్లికుదరు: మండలంలోని గ్రామాల్లో ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు.
మరిపెడ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడులను బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన బోధన, భోజనం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నదని పీఆర్టీయూ జిల్లానాయకుడు ఎల్ మహేశ్ అన్నారు. గాలివారిగూడెంలో సర్పంచ్ ఎడెల్లి రామయ్యతో కలిసి గ్రామంలో బడిబాట నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులపై అవగాహన కల్పించారు. లక్ష్మీరాణి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, మేరిశీల పాల్గొన్నారు.
నర్సింహులపేట: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మొరుగైన విద్య అందుతున్నదని ఉపాధ్యాయులు మండలంలోని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.