మహబూబాబాద్: మున్సిపాలిటీ పరిధిలో నడుస్తున్న వాహనాలు మంచి కండిషన్లో ఉండాలని చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కమీషనర్ ప్రసన్నరాణితో కలిసి మున్సిపల్ కార్యాలయంలో నడిచే వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వాహనాలకు చిన్నపాటి రిపేర్లు వస్తే వెంటనే బాగు చేయించాలన్నారు. మున్సిపల్ వాహనాలు రోజూ రోడ్డెకితేనే పట్టణమంతా పరిశుభ్రంగా ఉంటుందని తెలిపారు.
చెత్త సేకరణకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా వాహనాలను ఫిట్నెస్తో ఉంచాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏఈ సురేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీహరి, గురులింగం, వెహికిల్ ఇన్చార్జీ సత్యనారాయణ, ఈఈ క్రాంతి పాల్గొన్నారు.