మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలో నిర్మిస్తున్న నూతన మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ప రిశీలించారు. ఎమ్మెల్యే భవన నిర్మాణ మ్యాప్ను పరిశీలించి పనులు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ డా. పాల్వాయి రాంమోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, చిట్యాల జనార్ధన్, మార్నేని రఘు, గోగుల రాజు, చౌడవరపు రంగన్న, డౌలాగర్ శంకర్, వీరేందర్, మంగళంపెళ్లి రాజ్ కుమార్, మున్సిపల్ అధికారులు తదితరులు ఉన్నారు.