మహబూబాబాద్ : తేమ శాతం 17కంటే తక్కువ ఉంటేనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ శశాంక తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోళ్లపై మండలస్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకురాగానే తొలుత తేమ శాతం, శాంపిళ్లను సేకరించి కవర్లో భద్రపరుచాలని, వివరాలను రిజీస్టర్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో ఎంట్రీ చేయలన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని బట్టి కొనుగోళ్లు చేపట్టాలన్నారు.
డీఆర్డీఏ 12 చోట్ల, సహకార శాఖ ఆధ్వర్యంలో 16 కొనుగోలు నిర్వహణ చేయలన్నారు. క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు రైతుబంధు కో-ఆర్డినేటర్లు పాల్గొని రైతులకు ధాన్యం విక్రయాలపై అవగాహన కల్పించాలన్నారు.