న్యూట్రీషన్ గార్డెన్ల పెంపకానికి ఐసీడీఎస్ శ్రీకారం
పౌష్టికాహారం అందించడమే లక్ష్యం
సాగు విధానంపై అవగాహన
దంతాలపల్లి, మార్చి 29: బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్యానికి భరోసానిస్తున్న ఐసీడీఎస్ తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంగన్ వాడీ కేంద్రాల్లో న్యూట్రీగార్డెన్ల పెంచుతూనే, లబ్ధ్దిదారుల ఇళ్లలో కిచెన్ గార్డెన్ల ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ఆకు, తీగజాతి కూరలను పండించేలా వారికి అవగాహన కల్పిస్తుండగా, సత్ఫలితాలు వస్తున్నా యి. ఏటా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్లో పోషణమాసోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధ్దిదారులకు పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహ న కల్పిస్తుంటారు. ఈ సారి న్యూట్రీషన్ గార్డెన్ల (పెరటి తో టల పెంపకం) ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ మేర కు అంగన్ వాడీ కేంద్రాల్లోని ఖాళీ స్థలాల్లో కిచెన్ గార్డెన్, పెరటి తోటలు పెంచుతున్నారు. మరోవైపు అంగన్ వాడీ కేంద్రాలకు వచ్చే లబ్ధిదారుల ఇళ్లల్లో కిచెన్ గార్డెన్ల ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. తోటకూర, పాలకూర, గోంగూరతో పాటు కరివేపాకు, కోత్మీరు, పూదీన, మెంతి, సోరకాయ, చిక్కుడు, కాకర, మిర్చి, బెండ, టమా ట, వంకాయ వంటి కూరగాయల సాగు విధానంపై వివరిస్తున్నారు. అంతేగాకుండాపండ్లు, పూల మొక్కల సాగుపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తుండడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ స్థలం లేకుంటే గ్రామంలోని ప్రభుత్వ భూమి తేదా ప్రభుత్వ పాఠశాలల్లో పెరటి తోటలను పెంచుతున్నారు.
మరిపెడ ఐసీడీఎస్ ప్రాజెక్ట్..
స్త్రీ శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) మరిపెడ ప్రాజెక్ట్ కింద 4 మండలాలు మరిపెడ, దంతాలపల్లి, నర్సింహులపేట, చి న్నాగూడురు పరిధిలో 12 అంగన్వాడీ సెక్టార్లు ఉన్నాయి. మొత్తం 297 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో గర్భిణులు 1126, బాలింతలు 1082, 0-6 ఏళ్లలోపు వా రు 9501 మంది ఉన్నారు. ప్రస్తుతం మరిపెడ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో తోటల పెంపకం ద్వారా ఆకుకూర, తీగజాతి కూరగాయలను సాగు చేస్తున్నారు.