ఇద్దరిపై కేసు నమోదు
వాజేడు, జూన్ 20 : అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత మిర్చి విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. మండల వ్యవసాయధికారి వాజీద్ మహ్మద్, ఎస్సై బండి హరికృష్ణ కథనం ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు ధర్మవరం గ్రామంలోని సత్యకృష్ణ ఆగ్రో ఏజెన్సీస్ దుకాణంలో పెట్టుబడి భాగస్వామి అయిన కోరకల్ గ్రామానికి చెందిన అల్లి సూరిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ. 6లక్షల విలువైన యువ్ఎస్ (341ఎఫ్1) హైబ్రిడ్ రకం మిర్చివిత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. సూరిబాబుతోపాటు అతడి భాగస్వామి భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన పిన్నమరాజు సోమరాజు (కొత్తరాజు)పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.