మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 3వ విడత ప్రవేశాల గడువును పొడింగించినట్లు మానుకోట ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రాధాకృష్ణన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి పాసైన విద్యార్ధులందరూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మొదటి, రెండు విడతల్లో సీట్ రాని వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ ద్వారా ఈ నెల 10 వరకు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.