మహబూబాబాద్ : జిల్లాలో ఘో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ లారీని బైక్ ఢీ కొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నర్సింహుల పేట మండలం కొత్త తండా శివారు నీలికుర్తి స్టేజి సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గోప తండాకు చెందిన అజ్మీరా నరేష్ (20)అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.