మహబూబాబాద్, జనవరి 22 : తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలను ఆదుకునే ప్రభుత్వమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 31 మందికి రూ.8.82 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజాకర్షక పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. బంగారు తెలంగాణ దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, పట్టణాధ్యక్షుడు గద్దె రవి, బీఆర్ఎస్ నాయకుడు మార్నేని వెంకన్న, మండలాధ్యక్షుడు తేళ్ల శ్రీను, బిక్కునాయక్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ : మహబూబాబాద్ ప్రీమియర్ లీగ్ జిల్లాకు వన్నె తెస్తుందని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. ఆదివారం ఎంపీఎల్ క్రికెట్ లీగ్ విజేత టీజీ బాయ్స్ జట్టుకు ట్రోఫీ, రూ.30 వేల నగదును అందించారు. రెండు వారాల పాటు మానుకోటలో క్రికెట్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రికెట్ స్టేడియంతో పాటు వివిధ క్రీడల నిర్వహణ కోసం ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ యూత్ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్రెడ్డి, డాక్టర్ చాపల రంజిత్రెడ్డి, జర్పుల స్వామి, కౌన్సిలర్లు బాలునాయక్, యాకయ్య, లయన్స్ క్లబ్ బాధ్యులు అశోక్రెడ్డి, అనుమాల వెంకటేశ్వర్లు, కాళీనాథ్, టోర్నమెంట్ కన్వీనర్ సయ్యద్ జాకీర్హుస్సేన్, ఆర్గనైజింగ్ కమిటీ బాధ్యులు సందీప్నాయక్, శ్రీపాల్, సాయి, గౌస్, శ్రీధర్ పాల్గొన్నారు.