ఏటూరునాగారం, డిసెంబర్ 19 : కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు త్వరలో ప్రారంభం కానున్నందున వాటిని బాలింతలు, గర్భిణులకు అందించే విధంగా సీడీపీవోలు ప్లాన్ చేసుకోవాలని ఐటీడీఏ పీవో అంకిత్ ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో ఏజెన్సీ ప్రాంతంలోని అభివృద్ధి, ఇతరత్రా పనులపై పీవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ద్వారా చేపడుతున్న పనుల వివరాలను తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ న్యూట్రిషన్ కిట్స్ అందించాలని సూచించారు. జనవరి నెల నుంచి నీటి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ నీరు అం దించే విధంగా చూసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ వెంకట సతీశ్కు సూచించారు.
మండల కేంద్రంలోని లైబ్రరీ భవనం మరమ్మతులు చేయించాలని, పనితీరును పర్యవేక్షించాలని ఎంపీవో, ఎంఈవోలను ఆదేశించారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అర్హులైన అభ్యర్థులకు ఏజెన్సీ సర్టిఫికెట్ల జారీ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న రైతుబంధు దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలన్నారు. పదో తరగతి పరీక్షలు స మీపిస్తున్నందున జిల్లా పరిషత్, గిరిజన సంక్షేమశాఖ పాఠశాల విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ పోచం, జీసీసీ డీఎం ప్రతాప్రెడ్డి, పీహెచ్వోలు రమణ, ఎస్వో రాజ్కుమార్, ఈఈ హేమలత, ఆర్సీ వో రాజ్యలక్ష్మి, ఎంఈవో సురేందర్, ఏసీఎంవో శ్రీరాములు,పెసా జిల్లా కో ఆర్డినేటర్ ప్రభాకర్ పాల్గొన్నారు.
గిరిజన దర్బార్లో వినతుల వెల్లువ
ఏటూరునాగారం : స్థానిక ఐటీడీఏ కార్యాలయం లో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో గిరిజనులు తమ వినతులు సమర్పించారు. పీవో అంకిత్ వినతులు స్వీకరించారు. వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను పీవో ఆదేశించారు. దర్బార్లో డీడీ పోచం, పీహెచ్వోలు రమణ, భారతి, ఈఈ హేమలత, ఏవో దామోదర్స్వా మి, ఎస్వో రాజ్కుమార్, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ వెంకట సతీశ్, మేనేజర్ శ్రీనివాస్, తహసీల్దార్ సంజీ వ, ఎంపీడీవో కుమార్, ఎంఈవో సురేందర్, ఆర్సీవో రాజ్యలక్ష్మి, పెసా జిల్లా కో ఆర్డినేటర్ ప్రభాకర్ పాల్గొన్నారు.