హనుమకొండ చౌరస్తా, మార్చి 5 : కేయూ పరీక్షల విభాగం అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. బుధవారం నుంచి ఎల్ఎల్బీ పరీక్షలు ప్రారంభమవుతున్పటికీ ఇంకా హాల్టికెట్లు ఇవ్వకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుల్లో 3, 7, 9 సెమిస్టర్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీలో 3, 7, 9వ సెమిస్టర్ల్ పరీక్షలు బుధవారం మధ్యాహ్నం 2 నుంచి సా యంత్రం 5 గంటల వరకు జరుగనున్నయి.
అయితే ఇప్పటివరకు హాల్టికెట్లు అప్లోడ్ చేయక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 18నే పరీక్ష ఫీజు కట్టించుకున్న వర్సిటీ అధికారులు హాల్టికెట్లు మాత్రం అందజేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, హాల్టికెట్ల విషయమై కేయూ పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారిని వివరణ అడుగగా తెలుసుకొని పంపిస్తామని సమాధానమిచ్చారు.