హనుమకొండ, సెప్టెంబర్ 16: ‘మట్టి గణపతులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’ అని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. శనివారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మట్టి వినాయకుల ప్రతిమల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను పూజించవద్దన్నారు.
వినాయకచవితి పండుగను పురసరించుకొని 10వేల మట్టి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రకృతిని కాపాడుకోవాలని కోరారు. దేశంలో ప్రజలందరూ కలిసి మెలసి జీవించేందుకు పండుగలు దోహద పడుతాయన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఆది నుంచి జరుపుకునే పండుగలన్నీ ప్రకృతిని కాపాడుకునేందుకేనని తెలిపారు. మొకలు నాటడమే ప్రకృతిని పరిరక్షించడం కాదని ప్రకృతితో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. ఇందులో భాగంగానే పశ్చిమ నియోజక వర్గంలో ఐదేళ్లుగా మట్టి వినాయకుల ప్రతిమలను ప్రోత్సహిస్తున్నట్లు చీఫ్ విప్ తెలిపారు.
వినాయకచవితి ఉత్సవాల్లో మట్టి విగ్రహాలను వినియోగించడంలో హనుమకొండ జిల్లా రాష్ర్టానికి ఆదర్శం కావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు, బీఅర్ఎస్నాయకులు, పాల్గొన్నారు.
పింగిళి కాలేజీలో..
నయీంనగర్ : వడ్డేపల్లిలోని పింగిళి జూనియర్ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించగా, కార్యక్రమానికి చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.