న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మూలగుండ్ల మల్లారెడ్డిది సుపారీ హత్యగా పోలీసులు తేల్చారు. ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ నేతృత్వంలో స్పెషల్ టీమ్లు ఆరు రోజులపాటు నేరపరిశోధన చేశాయి. పాత గొడవల కారణంగా తోటి మైనింగ్ వ్యాపారులే సుపారీ ఇచ్చి మల్లారెడ్డిని హత్య చేయించారని ఎస్పీ ఒక ప్రకటనలో వెల్లడించారు. వరంగల్ నర్సంపేటకు చెందిన గోనెల రవీందర్, ములుగు మండలం మల్లంపల్లికి చెందిన పిండి రవియాదవ్, కొడిశలకుంటకు చెందిన వంచ రామ్మోహన్రెడ్డి కలిసి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన ఆర్ఎంపీ తడుక రమేశ్కు సుపారీ ఇచ్చినట్లు వివరించారు. ఈ నలుగురు నిందితులను అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. హత్యలో నేరుగా పాల్గొన్న కర్నూల్కు చెందిన కిరాయి రౌడీలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మూలగుండ్ల మల్లారెడ్డిది సుపారీ హత్యగా పోలీసులు శనివారం నిర్ధారించారు. ఈ నెల 1న సాయంత్రం 6.45 గంటలకు హత్య జరగ్గా ఎస్పీ సంగ్రామ్సింగ్ జి.పాటిల్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు నేరపరిశోధన చేశారు. మైనింగ్ భూముల గొడవల కారణంగా తోటి మైనింగ్ వ్యాపారులే హత్య చేయించినట్లు విచారణలో ఈమేరకు శుక్రవారం అర్ధరాత్రి ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు. హత్యకు గల కారణాలను అందులో పేర్కొన్నారు. వరంగల్ నర్సంపేట మండల కేంద్రానికి చెందిన రైస్మిల్లు యజమాని, మైనింగ్ వ్యాపారి గోనెల రవీందర్, ములుగు మండలం మల్లంపల్లికి చెందిన మైనింగ్ వ్యాపారి పిండి రవియాదవ్, అదే మండలం కొడిశలకుంట గ్రామానికి చెందిన మరో మైనింగ్ వ్యాపారి రామ్మోహన్రెడ్డి కలిసి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామానికి చెందిన ఆర్ఎంపీ తడుక రమేశ్కు సుపారీ ఇచ్చినట్లు వివరించారు. ఈ నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. శనివారం ఉదయం వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి వరంగల్లోని కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రిమాండ్కు తరలించారు.
మల్లారెడ్డికి పలువురు మైనింగ్ వ్యాపారులతో గతంలో గొడవలు జరిగాయి. క్రమంలోనే అతడి హత్య జరగ్గా పోలీసులు విచారణ కోసం మల్లంపల్లిలోని 50మంది మైనింగ్ వ్యాపారులను ఈనెల 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ములుగు పోలీస్స్టేషన్ను పలుమార్లు పిలిచి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా గోనెల రవీందర్, పిండి రవియాదవ్, వంచ రామ్మోహన్రెడ్డితో మల్లారెడ్డికి పదేళ్లుగా భూ తగాదాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయన్ను హత్య చేయించాలని ఆర్ఎంపీ తడుక రమేశ్కు భారీ మొత్తంలో సుపారీ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. డబ్బు ఆశతో రమేశ్ కర్నూల్కు చెందిన కిరాయి రౌడీలను రంగంలోకి దింపి పథకం ప్రకారం ఈనెల 1వ తేదీన పందికుంట క్రాస్ వద్ద హత్య చేయించినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, పోలీసుల కంట పడకుండా శ్రీనగర్ నుంచి తండాల మీదుగా నర్సంపేటకు చేరుకొని ఓ ప్రదేశంలో పార్టీ చేసుకొని, తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారని తెలిపారు. హత్యలో నేరుగా పాల్గొన్న కిరాయి రౌడీలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు, హత్యలో పాల్గొన్న వ్యక్తులతోపాటు వారికి సహకరించిన వారిని నేడో రేపో పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
వరంగల్ లీగల్ : న్యాయవాది మల్లారెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదురొంటున్న నలుగురు నిందితులను ములుగు పోలీసులు శనివారం ఇన్చార్జి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్టులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పేరొంటూ మిగిలిన 11 మంది పరారీలో ఉన్నట్లు చూపించారు. మొదటి ముద్దాయి గోనెల రవీందర్, రెండో ముద్దాయిగా పిండి రవియాదవ్, మూడో ముద్దాయి వంచ రామ్మోహన్రెడ్డి నాలుగో ముద్దాయిగా తడక రమేశ్ను ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్టును పరిశీలించిన న్యాయమూర్తి అనిత రాపోలు నిందితులను ఈనెల 18 వరకు రిమాండ్ తరలించాలని ఆదేశించారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ నిందితులను ఖమ్మం జైలుకు తరలించారు.