బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. రోడ్డు షోతో పాటు కార్నర్ మీటింగ్ సక్సెస్ కావడంతో నాయకులు హర్షం వ్యక్తం చేశారు. భారీగా జనం తరలిరాగా, రామన్న మాటలకు వారు ఫిదా అయ్యారు. ఆయన మాట్లాడుతుండగా భారీగా కేరింతలు మొదలయ్యాయి. ‘మీ అందరికీ నాలుగు వేల పింఛన్ పడ్డదట కదా.. అత్తలకు పడలేదా..
కోడళ్లకు రూ.2500, తులం బంగారం వచ్చిందా’ అని కేటీ ఆర్అడగడం తో జనం నుంచి ఒక్కసారిగా రాలేదని హుషారుగా సమాధానం వచ్చింది. ‘గిన్ని లంగ మాటలు చెప్పిర్రు. ఇంత గ్లామరస్గా ఉన్నడు మీ రమణన్న.. ఇత న్ని ఓడించి ఆ నల్లమొకపోన్ని తెచ్చుకున్న రు’ అని కేటీఆర్ అనగానే ప్రాంగణమంతా నినాదాలతో దద్దరిల్లింది. రేవంత్రెడ్డి టైమంతా రెండేళ్లే.. ఎంత మంది దేవుళ్లు ఉన్నరో అంతమందికి మొక్కుకో.. నువ్వు పాతాళంలో దాక్కున్నా నీ కుంటదిరా పొట్టోడా.. అనగానే జనం స్పందించి జై తెలంగాణ.. జై కేసీఆర్ అని నినాదాలు చేశారు.