పలిమెల, జూన్ 2: ఉపాధిహామీ పనుల్లో కూలీలకు ఫొటో తిప్పలు తప్పడం లేదు. కొత్త నిబంధనల ప్రకారం పని ప్రదేశంలో కూలీల హాజరు నమోదుకు ఉదయం, సా యంత్రం ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మండలంలోని లెంకలగడ్డ గ్రామంలో ఉపాధి పనికి వచ్చిన ఆకుల శంకరయ్య యాప్లో ఫొటో తీసుకోవడం లేదు. వందకు పైగా ఫొటోలు తీసినా ఫలితం కనిపించలేదు.
కూలీల మొహానికి ఫౌడర్ అద్దినా ఫొటో రాలేదు. దీంతో చేసేది లేక కూలీని పడుకోబెట్టి ఫీల్డ్ అసిస్టెంట్ ఫొటో తీశారు. ఆ తరువాత ఫొటోలు దిగే కూలీలకు గంట వరకు సమయం పట్టడంతో అసహనం వ్యక్తం చేశారు. కూలీలు మాట్లాడుతూ.. కొలతల ప్రకారం తీసుకుని వెళ్లే వాళ్లమని ఫొటో ల కొరకు ఉదయం సాయంత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. మొదట ఉన్న పద్ధతినే కొనసాగించాలని ఆందోళన చేస్తున్నారు.