స్టేషన్ ఘన్పూర్, ఫిబ్రవరి 26 : బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఇందులో భాగంగానే స్టేషన్ఘన్పూర్లోని పలు ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం వేలేరు మండలం సోడాషపల్లిలో రూ.133 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రజలు తరలిరావాలని ఆయన కోరారు. ఆదివారం డివిజన్ కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు చింతకుంట్ల నరేందర్రెడ్డి నివాసంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహ రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కృషితో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతమైందని, మంత్రి కేటీఆర్తో రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరిస్తూ కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. ప్రపంచంలోని అనేక సంస్థలు కేటీఆర్ సమర్ధతను గుర్తించి అంతర్జాతీయ సమావేశాలకు, ఆహ్వానిస్తున్నాయని వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలైన చిల్పూరు, ధర్మసాగర్, వేలేర్ మండల్లోని గ్రామాలకు సాగునీరు అందించేందుకు మూడు ఎత్తిపోతల పథకం పనులకు మంత్రి కేటీఆర్ సోమవారం శంకుస్థాపన చేస్తారని శ్రీహరి వివరించారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు వేలాదిగా పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావాలని ఆయన కోరారు.
ప్రతి పక్షాలు ప్రజల కోసం పనిచేయాలి
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్, కొన్ని పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలుంటే గుర్తించి ప్రభుత్వ దృష్టికి తేవాలి తప్ప అనవసర విమర్శలు తగదన్నారు. అవగాహన లేకుండా ఉనికి కోసం కొన్ని పార్టీల నేతలు పాదయాత్రలు చేస్తున్నారని, దీనిని ప్రజ లు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. ఓ జాతీయ పార్టీకి అధ్యక్షుడైన బండి సం జయ్ హుందాగా ప్రవర్తించకుండా సర్కారుపై అనవసర ఆరోపణలు చేస్తూ జోకర్ను తలపిస్తున్నారని వివరించారు. దమ్ముంటే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణకు నిధులు తీసుకురావాలని ఆయన హితవు పలికారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి సహకరించడంలేదని, నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
సభకు వేలాదిగా తరలి రావాలి : ఎమ్మెల్యే రాజయ్య.
ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా ఉన్నారని, విపక్షాల విమర్శలను పట్టించుకోరని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాఫన చేయనున్నారని, వేలేరు మండలంలో జరిగే సభకు ప్రజలు వేలాదిగా తరలిరావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బెలిదె వెంకన్న, మండల అధ్యక్షులు మాచర్ల గణేశ్, భూక్యా రమేశ్ నాయక్, ఎంపీటీసీ సింగపురం దయాకర్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పోగుల సారంగపాణి, సర్పంచ్లు మల్లేశం, గాదె చంద్రయ్య, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పోలెపల్లి రంజిత్ రెడ్డి, నాయకులు కందుల గట్టయ్య, సట్ల కుమార్, ఆకారపు అశోక్, గుండె మల్లేశ్, మారపల్లి ప్రసాద్ పాల్గొన్నారు.