నర్సంపేట రూరల్, డిసెంబర్ 2: గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం మద్దతు ధర అందిస్తున్నదని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్ మురాల మోహన్రెడ్డి కోరారు. మహేశ్వరంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఏ-గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్కు రూ. 2,060, సీ-గ్రేడ్ ధాన్యానికి రూ. 2,040 మద్దతు ధర చెల్లిస్తున్నదని వివరించారు. అన్నదాతలు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. కార్యక్రమంలో ఏఈవోలు మెండు అశోక్, భరత్, నవీన్, శ్యామ్, వైస్ చైర్మన్ మేర్గు శ్రీనివాస్, డైరెక్టర్లు దామెర రవీందర్, లక్ష్మణ్, జనార్దన్రెడ్డి, పెసరు సాంబరాజ్యం, కోమాండ్ల రాజిరెడ్డి, సీఈవో జక్కుల మధు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
నల్లబెల్లి: రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వస్తున్నారని నరక్కపేట సర్పంచ్ వక్కల మల్లక్క అన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండడం సరికాదన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఓదెల విజయలక్ష్మి-రవి, వినూష, ఉప సర్పంచ్ వడ్లూరి రమేశ్, టీఆర్ఎస్ నాయకులు వక్కల తిరుపతి, వైనాల రమేశ్, ఓరుగల్లు, పాకాల వీలో అధ్యక్షులు రమ, సునీత, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ స్తులు పాల్గొన్నారు.