పరకాల, సెప్టెంబర్ 20 : తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. పరకాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ నూ తన చైర్ పర్సన్ నిప్పాని హైమావతీ సత్యనారాయణను చైర్ పర్సన్ సీట్లో కూర్చోబెట్టి శుభాక్షాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం, వ్యవసాయ కుటుంబంలో పుట్టి, రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి పెట్టపీట వేశారన్నారు. సీ ఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందన్నా రు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంపై వివ క్ష, ఎద్దేవా చూపిన నాయకులే తెలంగాణ అభివృద్ధిని మెచ్చుకుంటున్నారని ఇదంతా సీఎం సాహసోపేత నిర్ణయాలతోనే సాధ్యమయిందన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే తెలంగాణ రాష్ట్రం లో నిరంతర ఉచిత విద్యుత్ సాధ్యమైందని హ ర్షం వ్యక్తం చేశారు. 65 ఏండ్ల ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.
మోదీకి బుద్ధి చెప్పాలి: ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
రైతులను మోసం చేసిన ప్రధాని మోదీకి బుద్ధి చెప్పాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అంతేకాకుండా రైతు వ్యవస్థను కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు నల్లా చట్టాలను తీసుకువచ్చిన మోదీ రైతుల నిరసనలతో వెనక్కి తగ్గారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంటే.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారన్నారు.
వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత
సీఎం కేసీఆర్దే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాల్లో రిజర్వేషన్ తీసుకువచ్చి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతోనే బీసీలకు మార్కెట్ పాలకవర్గాల్లో పదవులు లభిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా మారిందన్నారు. పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ లక్ష్యం
వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షే మం, అభివృద్ధి జోడెద్దుల్లాగా దూసుకెళ్తున్నాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరా డి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అవన్నీ సిద్ధించాయన్నారు. ఎమ్మెల్సీ కవిత పోరాటంతోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సాధ్యమైందన్నారు. మహిళా బిల్లుపై కవిత చేసిన పోరాటంతోనే బీజేపీ మహిళా బిల్లును ప్రవేశపెట్టిందన్నా రు. ఈ కార్యక్రమంలో పరకాల, నడికూడ, శాయంపేట మండలాల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.