వరంగల్, మార్చి 27(నమస్తే తెలంగాణ): మైనార్టీ మహిళల కోసం ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన కుట్టుమిషన్లు ఆరు నెలలుగా మూలుగుతున్నాయి. పంపిణీకి ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పిన అధికారులు.. ఇప్పుడేమో సర్కారు నుంచి అనుమతి రావాలంటున్నారు. మైనార్టీ మహిళలకు ఉపాధి కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా వందశాతం సబ్సిడీపై కుట్టుమిషన్లు అందజేసింది. ఈ నేపథ్యంలో మైనార్టీ బంధు పథకం ద్వారా వరంగల్ జిల్లాలో అర్హులైన మహిళలకు పంపి ణీ చేసేందుకు ఆరు నెలల ముందు కుట్టుమిషన్లు మంజూరు చేసింది. రాయపర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట, సంగెం, గీసుగొండ, దు గ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం తదితర మండలాల్లో ని మైనార్టీ మహిళలకు సుమారు 170కి పైగా కుట్టుమిషన్లు కేటాయించింది. ఒక్కో కుట్టుమిషన్ విలువ రూ.10వేలు ఉంటుంది. లబ్ధిదారుల ఎంపిక జరిగిన తర్వాతే ప్రభుత్వం ఈ కుట్టుమిషన్లను జిల్లాకు సరఫరా చేసింది.
గత సెప్టెంబర్లో కుట్టుమిషన్లను మైనార్టీ శాఖ ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఈ మిషన్లలో వందకు పైగా కుట్టుమిషన్లను నర్సంపేటలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో, 70కి పైగా కుట్టుమిషన్లను వరంగల్ శంభునిపేటలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో మైనార్టీ శాఖ అధికారులు భద్రపరిచారు. డిసెంబర్లో ఎన్నికల కోడ్ ముగిసింది. అప్పటివరకు వేచిచూసిన లబ్ధిదారులు కోడ్ ముగిసిన తర్వాత మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులను కలిశారు. తమ పేర మంజూరైన కుట్టుమిషన్లను అందజేయాలని కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉన్న కుట్టుమిషన్లను పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. కాలం గడిచిపోతున్నా తమకు కుట్టుమిషన్లు అందించకపోవడంతో లబ్ధిదారులు మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులను కూడా కలిశారు. ఇలా ఎన్నిసార్లు మైనార్టీ శాఖ కార్యాలయం చుట్టూ తిరిగినా ప్రభుత్వం నుంచి కుట్టుమిషన్ల పంపిణీకి గ్రీన్సిగ్నల్ రావ డం లేదని, అనుమతి వచ్చిన వెంటనే సమాచారం ఇస్తామనే సమాధానమే అధికారుల నుంచి వస్తున్నదని లబ్ధిదారులకు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.
ఉద్దేశపూర్వకంగానే కాలయాపన
తీరా కొద్దిరోజుల క్రితం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున కుట్టుమిషన్లను ఇప్పుడు పంపిణీ చే యలేమని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు లబ్ధిదారులకు చెబుతున్నారు. అర్హు లు మాత్రం కేసీఆర్ ప్రభుత్వం తమ పేర మంజూరు చేసిన కుట్టుమిషన్లను పంపిణీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లే దని, పంపిణీ చేయకుండా ఉన్న కుట్టుమిషన్ల కోసం ఈ సర్కారు కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి, వీటిని పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసిందంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రె స్ ప్రభుత్వం తమ పేర మంజూరైన కుట్టుమిషన్లను పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తున్నదని ధ్వజమెత్తుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన కుట్టుమిషన్లపై గత ముఖ్యమంత్రి ఫొటోతో కూడిన స్టిక్కర్ ఉందని, ఆ స్టిక్కర్ను తొలగించాక ప్రభుత్వం పంపిణీ చేయనుందని మైనార్టీ సంక్షేమ శాఖలోని ఓ అధికారి తమకు చెప్పారని లబ్ధిదారులు కొందరు తెలిపా రు. ఏదేమైనా మైనార్టీ మహిళలకు పంపి ణీ చేయడానికి గత ప్రభుత్వం జిల్లాకు సరఫరా చేసిన ఉచిత కుట్టుమిషన్లు ఆరు నెలల నుంచి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వృథాగా ఉంటుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.