గిర్మాజీపేట, మే 14 : నగరంలో అందాలు కనువిందు చేశాయి. ప్రముఖ మోడల్స్ సందడి చేశారు. వరంగల్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన గణేశ్ జ్యువెల్లరీ షాపును ఆదివారం ప్రారంభించారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తోపాటు కార్పొరేటర్ గందె కల్పన, యజమాని బజ్జూరి పూర్ణచందర్ షాపును ప్రారంభించగా మిస్ యూనివర్స్ 2020 రన్నరప్ అడ్లైన్ క్యాస్టెలినో, మిస్ యూనివర్స్ ఇండియా-2018 నేహాల్ చూడాస్మా తదితర మోడల్స్ సందడి చేశారు.
షాపులో జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మోడల్స్ నగలను చూపిస్తూ కనువిందు చేశారు. అలాగే, షాపులో మొదటిసారి ఆభరాణాలను కొనుగోలు చేసిన గందె నవీన్ తన సతీమణి, కార్పొరేటర్ గందె కల్పనకు అలంకరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, బీఆర్ఎస్ నేతలు, షాపు యాజమాన్యం పాల్గొన్నారు.