ఖిలావరంగల్, మార్చి 15 : తెలంగాణలో అంధత్వ నివారణే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం శివనగర్ భూపేశ్నగర్లో కంటివెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కంటి వెలుగుతో ప్రతీ ఇంట్లో వెలుగునిండాలని, సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కుమారస్వామి, 34వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల సతీశ్, బీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి కలకొండ అవినాశ్ పాల్గొన్నారు.
స్కూల్ నిర్మాణంలో నాణ్యత పాటించాలి
దేశాయిపేటలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని ఎమ్మెల్యే నరేందర్ ఆదేశించారు. డీఈ, ఎస్ఈలతో కలిసి పనులను ఆయన పరిశీలించి.. మైనార్టీల భవన సముదాయ నిర్మాణ విషయమై అధికారులతో సమీక్షించారు. వచ్చే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేయాలన్నారు. అలాగే రూ.9 కోట్లతో పలుచోట్ల నిర్మిస్తున్న రోడ్లు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ పనులను పర్యవేక్షించారు. అలాగే దేశాయిపేటలో ఇటీవల మృతిచెందిన మట్ట కట్టమ్మకు నివాళలఅర్పించారు. ఇక్కడ కార్పొరేటర్ కావటి కవితారాజు యాదవ్, కార్పొరేటర్ సురేశ్కుమార్ జోషి, డివిజన్ అధ్యక్షుడు సోల రాజు, ఎండీ యాకుబ్, యూత్ నాయకులు శివ, రాంకీ, రాజు, పటేల్ పాల్గొన్నారు.