కాశీబుగ్గ, ఫిబ్రవరి 24 : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరంలా మారిందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గురువారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో 3,14వ డివిజన్ లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 43 మందికి రూ.43లక్షల 4వేల 988 విలువైన చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. నిరుపేదల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. విలీన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ తహసీసిల్దార్ సత్యపాల్రెడ్డి, కార్పొరేటర్లు తూర్పాటి సులోచన, జన్ను షీభారాణి, దిడ్డి కుమారస్వామి, నాయకులు ముడుసు నరసింహ, కేతిరి రాజశేఖర్, గండ్రాతి భాస్కర్, పత్రి సుభాశ్, గంధం గోవింద్, పత్రి రాజపోషాలు, పసులాది మల్లయ్య, మచ్చర్ల స్టాలిన్, కొత్తపల్లి అనిల్, తూర్పాటి సంపత్, అరుకల విజయలక్ష్మి, కొత్తపల్లి యాదగిరి, నేరెళ్ల రాజు, బొచ్చు రాజు, జన్ను స్వామిదాస్, లింగం కోటి, పండుగ రవీందర్రెడ్డి, బొల్లం విజయ్ పాల్గొన్నారు.
వర్ధన్నపేట : వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పట్టణంలోని 7వ వార్డు కౌన్సిలర్ పాలకుర్తి సుజాత, మాజీ జడ్పీటీసీ సారంగపాణి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో విలీనమైన తండాలు, కోనాపురం గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. తండాల్లో చేపట్టాల్సిన పనులపై మున్సిపల్ పాలకమండలితో చర్చించి నివేదికలను తయారు చేసినట్లు చెప్పారు. అనంతరం కార్యకర్తలతో కలిసి పాలకుర్తి సారంగపాణి ఎమ్మెల్యేను సత్కరించారు.