కాళేశ్వరం, మార్చి 26 : శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి హుండీలను మంగళవారం లెక్కించినట్లు ఆలయ ఈవో మహేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. 76 రోజులకు సంబంధించి రూ. 22,78,554 ఆదాయం సమకూరినట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ సాయిబాబా, బుర్రి శ్రీనివాస్ తదితరులు లెక్కింపును పర్యవేక్షించినట్లు ఈవో తెలిపారు.