కళా తపస్వి, సంగీత దర్శకుడు, నటుడు కే విశ్వనాథ్కు ఓరుగల్లుతో మధుర స్మృతులున్నాయి. లలిత క ళల నేపథ్యంలోనే విశ్వనాథ్ అనేక సినిమాలు తీయగా, అయనను ఎక్కువ మంది అభిమానించేవారు. భాగ్యనగరం తర్వాత తనకు ఓరుగల్లు నగరం అంటే అమిత ఆనందం, చెప్పలేని అనుభూతని ఆరేళ్ల కిందటే కాకతీయుల గడ్డపై చెప్పారు. వరంగల్కు వచ్చినప్పుడల్లా ఆయనకు నగరవాసులు సన్మానాలు, సత్కారాలు చేసి సంబురపడ్డారు.
మరువని వరంగల్ కళా సంస్థలు..
భారతీయ సంస్కృతీసంప్రదాయాలు పాశ్చాత్య ప్ర భావంలో కొట్టుకుపోతున్న తరుణంలో ఇక్కడి కళలను సినిమాలుగా మలిచి సక్సెస్ అందుకుని అందరి మన్ననలు అందుకున్న కళా తపస్వి కే విశ్వనాథ్ను ఓరుగల్లు కళా సంస్థలు మరువలేదు. సభ్యత, సంస్కృతిని కాపాడడానికి ఆయన చేస్తున్న యజ్ఞం వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ‘వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ’ గుర్తించింది. సినిమాలు తీయడం వ్యాపారం కాదని, సమాజంలో కళారంగం ద్వారా ఎలాంటి సేవ చేస్తున్నామో గుర్తించాలని విశ్వనాథ్ పడుతున్న తపన చూసి ఆ సంస్థ శాం తిదూత-2016 అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు ప్రదానోత్సవ సభ 2017, ఫిబ్రవరి 2న హనుమకొండ సుబేదారిలోని రాయల్ గార్డెన్లో సంస్థ వ్యవస్థాపకు డు సిరాజొద్దీన్ ఆధ్వర్యంలోనిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్కు అవార్డు ప్రదానం చేసి సన్మానించా రు.
పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్రెడ్డితో పాటు అప్ప టి సీపీ గట్టు సుధీర్బాబు, ప్రముఖ కవి, వరంగల్ ఫి ల్మ్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అంపశయ్య నవీన్, వాగ్దే వి కళాశాలల చైర్మన్ దేవేందర్రెడ్డి, ఘంటా రామారెడ్డి తో పాటు అనేకమంది సాహిత్యాభిమానులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయనను ప్రముఖ కవి సిరాజొద్దీన్-మాషూఖ్ దంపతులతో పాటు సంస్థ సభ్యులు కళా తపస్వికి శాంతిదూత గౌనును తొడిగిస్తూ సత్కరించారు. ఓరుగల్లువాసుల మధ్య అవార్డు అందుకున్న విశ్వనాథ్ ఆనందంతో మునిగితేలారు. అదేవిధంగా 2019 మార్చిలో హనుమకొండలో రామ్రాజ్ షోరూం ప్రారంభోత్సవానికి వచ్చిన విశ్వనాథ్ను వరంగల్ బట్టల వ్యాపారులు సన్మానించారు.
అందరినీ అప్యాయంగా పలుకరించేవారు..
వరంగల్ నుంచి ఎవరు వెళ్లినా విశ్వనాథ్ ఆప్యాయంగా పలుకరించేవారు. వరంగల్కు చెందిన డ్యాన్స్ మాస్టర్, ఉపాధ్యాయుడు టీవీ అశోక్కుమార్ 1985లో డ్యాన్స్ డిప్లొమా పూర్తి చేసి, రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్న సమయంలో ఆయన దగ్గరికి వెళ్లినప్పుడు శాస్త్రీయ నృత్యం గొప్పతనం, విశిష్టతను వివరించి, అందులో రాణించాలంటూ అభినందించారు.
విశ్వనాథ్ మృతికి ఓరుగల్లు సాహితీ, కళాకారుల సంతాపం..
కళా తపస్వి విశ్వనాథ్ మృతిపై ‘వరల్డ్ పీస్ ఫెస్టివల్ సొసైటీ’ సంస్థ ప్రతినిధులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే ప్రముఖ సాహితీవేత్తలు అంపశయ్య నవీన్, ఎన్వీఎన్ శాస్త్రి, లక్ష్మీ కాంతారావు, జేబీ మా తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకులు జడల శివ-హరిత, టీవీ అశోక్కుమార్, మల్లోజు సత్యనారాయణలు సంతాపం వెలిబుచ్చారు.
జీవితంలో అద్భుత అనుభూతి..
‘సాహిత్య కళా కేంద్రానికి నిలయమైన కాకతీయుల నేల నుంచి శాంతిదూత అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నాకు జీవితంలో అరుదైన అవార్డుగా మిగిలిపోయి, అద్భుత అనుభూతిని కలిగించింది. తాను తీసిన శంకరాభరణం సినిమా ప్రజలకు శాంతిని కలుగచేసింది. నేను అదే శాంతిదూత అవార్డు అందుకోవడం జన్మజన్మలకు మరిచిపోని తీపిగుర్తుగా మిగులుతుంది’ అని అవార్డు తీసుకున్న సందర్భంగా విశ్వనాథ్ పేర్కొన్నారు.
శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం.. లాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను తెలుగు ప్రజలకు అందించిన ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి విశ్వనాథ్కు ఓరుగల్లుతో విడదీయరాని అనుబంధం ఉంది. పలు మార్లు నగరానికి వచ్చి, తన అభిమానలోకాన్ని ఆనందంలో ముంచెత్తారు. సంగీతం నేపథ్యంలోనే విశ్వనాథ్ అనేక సినిమాలను తెరకెక్కించగా, నగరంలోని చాలా మంది ఆయనను అభిమానించేవారు. ఎంతోమంది కళాకారులు విశ్వనాథ్ను సన్మానించగా, వారికి దీవెనలందించారు. 2017లో శాంతి దూత అవార్డు స్వీకరించేందుకు కాకతీయుల గడ్డకు వచ్చిన ఆయన అభిమానుల హర్షధ్వానాలతో ఆనందంతో పరవశించిపోయారు.
– పోచమ్మమైదాన్, ఫిబ్రవరి 3